పుస్తకాల వ్యాపార ప్రపంచం అయిన “పబ్లిషర్స్ వీక్లీ” ఈ ఏడాది ఉత్తమ రచనల జాబితా తన తాజాసంచికలో ప్రచురించింది. కానీ, అది అమెరికావ్యాప్తంగా స్త్రీలకు కన్నెర్ర చేయించింది. దానికి కారణం 2009లో “పీ డబ్ల్యు” ఎంపికచేసిన టాప్ లిస్ట్ జాబితాలో ఒక్క రచయిత్రి రచన చోటుచేసుకోకపోవడమే.
ఈ ఏడాది గొప్ప రచయిత్రులే లేరట!
In పుస్తకాల ఊసులు on నవంబరు 6, 2009 at 9:43 పూర్వాహ్నంఇవి మీరు తప్పక చదవాల్సిందే!
In Uncategorized on నవంబరు 4, 2009 at 4:57 పూర్వాహ్నంకిందటి వారం ఈ బ్లాగులో వచ్చిన “కథో కథకుడో నచ్చకపోతే అదే చెప్పాలి గాని, అబద్దాలాడకూడదు” అన్న వ్యాసానికి మిత్రులు చాలా సానుకూలంగా స్పందించారు. అయితే ఎక్కువమంది ఆ “మాయ” (రచయిత గంటేడ గౌరునాయుడు) కథను, దానిపై జాన్సన్ చోరగుడి రాసిన విమర్శను కూడా అందివ్వమన్నారు.
కానీ సాంకేతికంగా ఆ పనులు చేతకాక ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు విశాఖపట్నంలోని ప్రింటెక్స్ సంస్థ యజమాని ఉమేష్ గొప్ప సాయం చేశారు. “మాయ” కథను, జాన్సన్ విమర్శ వ్యాసాన్ని విడివిడిగా పీడీఎఫ్ పైళ్లు తయారుచేసి అందించారు. వాటిని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను. దయచేసి వీటిని చదివి మళ్లీ నా వ్యాఖ్యను చదవమని కోరుకుంటున్నాను.
కథో కథకుడో నచ్చకపోతే అదే చెప్పాలి, అంతేకాని అబద్దాలాడకూడదు
In మరింకేదైనా.. on అక్టోబర్ 27, 2009 at 4:31 పూర్వాహ్నం“కథ ఇచ్చే అనుభూతి విలువను పాఠకుడు ప్రయత్నపూర్వకంగా నిర్ణయిస్తాడు. జీవితం పట్ల అతనికున్న అభిప్రాయాలు అతని భావజాలాన్ని నిర్ణయిస్తాయి. సాహిత్యం ద్వారా అతడు ఆశించే ప్రయోజనాన్ని అతని భావజాలం నిర్ణయిస్తుంది. ఆ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠకుడు కథ విలువను నిర్ణయించటానికి ప్రయత్నిస్తాడు”.
‘వల్లంపాటి సాహిత్య వ్యాసాలు’ (పే. 46) నుంచి
1
‘వార్త’ ఆదివారం అనుబంధం (మార్చి 23, 2008)లో ప్రచురితమైన గంటేడ గౌరునాయుడు కథ “మాయ” తర్వాత ‘కథావార్షిక – 2008′లో చోటుచేసుకుంది. త్వరలో రానున్న ‘కథ-2008′లో చోటుచేసుకోబోతుంది. ఇదికాక ప్రవాసాంధ్రుల పత్రిక ‘తెలుగునాడి’లో సైతం పునర్ముద్రణ పొందింది. తెలుగు కథాప్రియుల ఆదరాభిమానాలు సైతం పొందిందనే కళింగాంధ్ర కథాభిమానిగా భావిస్తూ వచ్చాను.